రాయలసీమపై నారా లోకేశ్ ఫోకస్.. మార్చి 1 నుంచి శంఖారావం

by srinivas |
రాయలసీమపై నారా లోకేశ్ ఫోకస్.. మార్చి 1 నుంచి శంఖారావం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ దూకుడు పెంచారు. మార్చి 1 నుంచి రెండో దశ శంఖారావాన్ని కొనసాగించనున్నారు. మొదటి దశ శంఖారావం సభలు సక్సెస్ కావడంతో లోకేశ్ మరింత జోష్ పెంచారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో శంఖారావం సభలు నిర్వహించిన ఆయన ఇప్పుడు రాయలసీమపై కన్నేశారు. రెండో దశ శంఖారావాన్ని సీమ జిల్లాల్లో పూరించనున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్ రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ తొలి జాబితా సైతం విడుదల చేసింది. దీంతో ఆయా జిల్లాల్లోని అభ్యర్థులు నారా లోకేశ్ రెండో దశ శంఖారావంలో పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతున్నారు. నారా లోకేశ్ రెండో దశ శంఖారావాన్ని విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read More..

‘పవన్ కల్యాణ్ చెబుతున్న 24+3=40 లెక్కేంటో అర్థం కావట్లేదు’



Next Story